Monday, May 6, 2024

పాత బ్రిడ్జి కూలుస్తుండగా ప్రమాదం.. శిథిలాల కింద ఇద్దరు యువకులు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. వాంకిడి మండల కేంద్రంలో నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులలో భాగంగా పాత బ్రిడ్జిని అధికారులు కూలుస్తున్నారు. అయితే పాత బ్రిడ్జి కూల్చే సమయంలో ప్రమాదవశాత్తూ బ్రిడ్జి శిథిలాల కింద ఇద్దరు యువకులు ఇరుక్కుపోయారు. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద ఇరుక్కుపోయిన వ్యక్తులను పోలీసుల సహాయంతో స్థానికులు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement