Saturday, April 27, 2024

నాకు లేట్ అవుతుంది… మాట్లాడనివ్వండిరా :రష్మిక

ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ రష్మిక మందన్న. తన అందంతో అభినయంతో తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. గతేడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ, వంటి చిత్రాలతో సూపర్ డూపర్ హిట్ లను అందుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది. కాగా బుధవారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన సుల్తాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక పాల్గొన్నారు. ఓవైపు ముంబైలో షూటింగ్ చేస్తున్నప్పటికీ ఈ ఈవెంట్ కోసం హైదరాబాద్ కు వచ్చారు. కాగా మొదట మాట్లాడి వెంటనే వెళ్లిపోవాలని మైక్ మొదట పట్టుకున్నారు.

కానీ అభిమానులు మాత్రం గోల గోల చేశారు. అభిమానులకు తగ్గట్టుగానే రష్మిక కూడా తన ముద్దు ముద్దు మాటలతో గోల చేసింది. కార్తీ చెన్నై లో నన్ను బాగా చూసకున్నారు. హైదరాబాద్ గురించి నేను బాగా చెప్పాను. మీరు కూడా వారిని బాగా చూసుకోవాలి అంటూ చెప్పుకొచ్చింది. అలా రష్మిక మాట్లాడుతున్న సమయంలో ఫ్యాన్స్ అంతా కూడా సూర్య సూర్య అంటూ గోల చేశారు. ఇంకా రష్మిక కూడా సూర్య కార్తీ అంటూ గోల చేసింది.ఇంకా ఎప్పటికీ ఫ్యాన్స్ ఆపకపోవడంతో అరే నన్ను మాట్లాడనివ్వండి రా… నాకు లేట్ అవుతుంది రా మళ్లీ వెళ్లాలి అంటూ చెప్పిన మాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement