Saturday, April 27, 2024

ట్విట్టర్ నిర్వాకం..వేరే దేశంగా లడాఖ్‌ మ్యాప్..

ట్విట్టర్ తన చర్యలతో దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటోంది. కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్‌ను వేరే దేశంగా తన వెబ్‌సైట్‌లో చూపించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అంతేకాదు జమ్మూ కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో అంతర్భాగంగా చూపించి భారతీయుల ఆగ్రహానికి గురవుతోంది. ట్విట్టర్‌ చర్యలపై సీరియస్‌గా ఉంది. భారత ప్రభుత్వం… ట్విట్టర్‌ గతంలోనూ ఇలాంటి తప్పులే చేసింది.. గత ఏడాది లడాఖ్‌ను చైనాలో అంతర్భాగమని చూపించింది.. దీనిపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తగా.. కేంద్రం వివరణ కోరడంతో క్షమాపణలు చెప్పింది.. సరిగ్గా ఏడాది కాకముందే.. మరోసారి అలాంటి తప్పే చేసింది.. ఈ సారి ఏకంగా లాడాఖ్‌ను వేరే దేశంగా చూపించింది. కాగా, కేంద్రం కొత్త ఐటీ రూల్స్‌ తెచ్చిన తర్వాత.. వాటి అమలు విషయంలో.. భారత్‌ ప్రభుత్వం వర్సెస్ ట్విట్టర్‌గా మారిపోయింది పరిస్థితి.. ప్రతీసారి ఏదో ఒక వివాదం కొనసాగుతూ వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement