Tuesday, May 7, 2024

TSRTC – టి ఎస్ అర్ టి సి ప్రభుత్వంలో విలీనం – కెసిఅర్ సంచలన నిర్ణయం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ మంత్రి మండలి నిర్ణయించింది. సోమవారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సచివాలయంలో ఐదుగంటలకు పైగా జరిగిన సమావేశం అనంతరం కేబినెట్‌ భేటీ సారాంశాన్ని మీడియాకు వివరించారు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు..

ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను పరిగణిస్తున్నట్లు ప్రకటించారాయన. కేబినెట్‌ భేటీలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విలీనం, విధివిధానాలు నిర్ణయించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారాయన. 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు తెలిపారాయన.

Advertisement

తాజా వార్తలు

Advertisement