Sunday, May 19, 2024

Bhadrachalam – రామయ్య సేవలో ఆర్టీసి ఛైర్మన్ – భద్రాచలం డిపో సిబ్బంది తో బాజిరెడ్డి మమేకం

భద్రాచలం – టిఎస్ ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ సతీసమేతంగా కుటుంబ సభ్యులతో భద్రాద్రి రామయ్య ను దర్శించుకున్నారు..దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారామచంద్రమూర్తి ఆశీస్సులు తీసుకున్నారు..టిఎస్ ఆర్టిసి సంస్థ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని, పూర్తిగా నష్టాలను దాటుకొని లాభాల వైపు పయనించాలని స్వామివారిని ప్రార్థించారు..

అనంతరం భద్రాద్రి టిఎస్ ఆర్టిసి బస్ డిపోను సందర్శించారు..ముందుగా భద్రాద్రి టిఎస్ఆర్టిసి డిపోలో హరిత తెలంగాణ కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు..పర్యావరణా పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు.బస్ డిపోలో నిర్వహిస్తున్న కార్యకలపాలను ఆర్టీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహాయ సహకారాలతో టిఎస్ఆర్టిసి సంస్థ మరింత పురోగతి సాధిస్తుందని, సంస్థలో ఉన్న పెండింగ్ బకాయిలు చెల్లించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.సంస్థలో ఉన్న సిబ్బంది కష్టపడి పనిచేసి సంస్థ లాభాలకు కృషి చేయాలని సూచించారు

.భద్రాద్రి స్వామి వారి దర్శనానికి వస్తున్న ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని సిబ్బందిని కోరారు.శ్రీ భద్రాద్రి రామయ్య దేవస్థానం బ్రహ్మోత్సవాలు మరియు ప్రత్యేకమైన విశేష రోజులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని చెప్పారు

- Advertisement -

.డిపోలో టిఎస్ ఆర్టిసి సంస్థ రికార్డులను పరిశీలించి EPK పెంచి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. టిఎస్ ఆర్టిసి ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీన బస్ స్టేషన్లలో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ రక్తదాన కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని, ప్రతి ఒక్కరూ ప్రాణ దాతలుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలను పాల్గొనే విధంగా ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

భద్రాచలం టిఎస్ఆర్టిసి డిపోలో కండక్టర్స్ మరియు డ్రైవర్లతో, ప్రయాణికులతో ముచ్చటించారు. వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు.డిపోను పరిశీలించిన అనంతరం ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు

.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక మరియు ప్రణాళిక, ఒలంపిక్ సంఘ ఉపాధ్యక్షులు, జెడ్పిటిసి ధర్పల్లి బాజిరెడ్డి జగన్మోహన్ ,, బాజిరెడ్డి అజయ్ ,, డిప్యూటీ రీజినల్ మేనేజర్ భవాని ప్రసాద్, భద్రాచలం డిపో మేనేజర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement