Friday, May 24, 2024

TS | రేవంత్ రెడ్డితో నందమూరి బాలకృష్ణ భేటీ

హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే, బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సమయంలో బసవతారకం ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా బాలకృష్ణతోనే ఉన్నారు. అనంతరం రేవంత్ రెడ్డితో పలు అంశాలపై బాలకృష్ణ మాట్లాడారు.

మరోవైపు, రేవంత్ రెడ్డిని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మర్యాదపూర్వకంగా కలిశారు. వీరితో పాటు మరికొందరు ప్రముఖులు కూడా హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రేవంత్ రెడ్డిని కలిశారు. పలు అంశాలపై రేవంత్ రెడ్డితో వారు మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement