Friday, May 3, 2024

COVID-19 | వరంగల్ ఎంజీఎంలో ఆరుగురు చిన్నారులకు పాజిటివ్ !

రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. వరంగల్ ఎంజీఎంలో ఆరుగురు చిన్నారులకు కరోనా సోకిన‌ట్టు నిర్ధార‌ణ అయ్యింది. కాకతీయ మెడికల్‌ కాలేజీలోని వైరాలజీ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా.. చిన్నారులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. దీంతో ఎంజీఎంలోని పిల్లల వార్డులో 20 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.

తాజాగా హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రిలో ముగ్గురు చిన్నారులకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా మహమ్మారి మళ్లీ కలవరానికి గురి చేస్తొంది. అప్రమత్తంగా ఉంటేనే కరోనా వైరస్‌ను అరికట్టవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement