Wednesday, May 15, 2024

త‌మిళ‌నాడులో విషాదం.. సర‌దాగా నదికి వెళ్లి ఏడుగురు అమ్మాయిలు మృతి..

తమిళనాడులో ఘోరం జరిగింది. కడలూరుకు చెందిన కెడిలం నది వద్ధ విషాదం చోటుచేసుకుంది. అక్క‌డి ప‌రిస‌ర గ్రామాలకు చెందిన అమ్మాయిలు ఆదివారం మధ్యాహ్నం నదిలో స్నానానికి వచ్చారు.. న‌దిలో దిగి స‌ర‌దాగా స‌మ‌యం గడుపుతున్నారు.. అయితే వారు నీటిలో దిగిన కొంతసేపటికి నీటి ప్రవాహం పెరిగింది. న‌ది ప్ర‌వాహానికి తాళలేక బయటికి రాలేకపోయిన అమ్మాయిలు న‌దిలో మునిగిపోయారు.. దీంతో అక్కడే ఉన్న‌కొంత మంది ఇది గమనించి నదిలో దిగి కొంతమందిని బయటికి తీసి కాపాడే ప్ర‌య‌త్నం చేశారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

కాగా, అప్పటికే కెడిలం నదిలో మునిగిపోయి ఏడుగురు అమ్మాయిలు దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో సంఘవి (16), సుముత (18), నవిత (18), ప్రియదర్శిని (15), మోనిష (18), దివ్యదర్శిని (10), ప్రియ (18)గా గుర్తించారు. వీరంతా కుచ్చిపాలయం, అయంకురింజిపడి గ్రామాలకు చెందినవారు. వారిలో ప్రియదర్శిని, దివ్యదర్శిని అక్కాచెల్లెళ్లు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement