Sunday, May 5, 2024

బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విషాదం-అభిమాని మృతి

బింబిసార చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ లోని శిల్ప క‌ళా వేదిక‌లో జ‌రిగింది. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హాజ‌రుకాగా..ఫ్యాన్స్ పోటెత్తారు. కాగా ఈ ఈవెంట్ లో విషాదం చోటు చేసుకుంది.బింబిసారా ఈవెంట్ లో ఓ అభిమాని మృతి చెందాడు. ఈవెంట్ లో అభిమాని అనుమాస్పద మృతి చెందాడు. పుట్టా సాయి రామ్ అనే అభిమాని మృతి చెందినట్లు సమాచారం .మృత‌దేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ లో పోస్టుమార్టన్ నిమిత్తం తరలించారు అధికారులు. ఇక సంఘటన పై పోలీస్ ల విచారణ కొనసాగుతోంది. పుట్టా సాయిరామ్ ది ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి గూడెం అని.. కూకట్ ప‌ల్లిలో లో వుంటూ ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement