Monday, May 20, 2024

Breaking: అతిసారతో వ్యక్తి మృతి

తాండూరు : అతిసారతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలోని తాండూరు మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మున్సిపల్ పరిధి 12వ వార్డులోని గొట్టుగ కృష్ణ అనే వ్యక్తి ఇంట్లో బషీరాబాద్ మండలం కాశింపూర్ కు చెందిన పూల గోపాల్ (35) కు అద్దెకు ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి నుంచి అతనికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. ఈరోజు ఉదయం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గోపాల్ మరణించాడు. మృతదేహాన్ని కుటుంభీకులు గ్రామానికి తరలించారు. మృతుడు పట్టణంలో పూల వ్యాపారం నిర్వహించేవాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement