Sunday, May 5, 2024

కాల‌నీ అభివృద్ధికి2.6కోట్ల నిధులు..అభినందించిన మంత్రి మ‌ల్లారెడ్డి..

ఘట్కేసర్ మండలం కాచవని సింగారం గ్రామంలోని నల్ల సాయి రెడ్డి స్మారకార్థం దివ్యానగర్ లో నల్ల మల్లారెడ్డి స్వంత నిధులతో 2.6కోట్లతో కమ్యూనిటీ హల్, ఇంకుడుగుంత, మంచి నీటి ట్యాంక్, పార్క్ ల నిర్మాణాన్ని ప్రారంభోత్స‌వం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట కార్మిక శాఖ మంత్రి చమకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు . భారీ మొత్తం వెచ్చించి కాలనీ అభివృద్ధికి పాటు పడుతున్న మల్లారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్ వెంకట్ రెడ్డి, నల్లా మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement