Wednesday, May 1, 2024

పెద్దపల్లి జిల్లాలో స్వల్ప భూకంపం..పరుగులు తీసిన జనం..

పెద్దపల్లి జిల్లాలో స్వల్పంగా భూమి కంపించడంతో జనం పరుగులు తీశారు. ఆదివారం రాత్రి ఆరు గంటల 49 నిమిషాలకు మూడు సెకన్ల పాటు భూమి కంపిచడంతో పలు ప్రాంతాల్లో జనం భ‌య‌భ్రాంతుల‌కు గురైయ్యారు. జిల్లా లోని పెద్దపల్లి మండలం అప్పన్నపేట, ముత్తారం మండలం లోని హరిపురం, కేశనపల్లి, దర్యాపూర్, గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీ, అశోక్ నగర్ ,గాంధీ నగర్ తో పాటు పలు ప్రాంతాలు స్వల్పంగా భూమి కంపించింది. పాలకుర్తి మండలంలోని ఈసాల తక్కలపల్లి, పాలకుర్తి, కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని వెన్నంపల్లి గ్రామాల్లో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement