Saturday, May 18, 2024

తిరుమ‌ల సేవ‌లో జాన్వీ క‌పూర్ …వెంక‌టేశునికి సాష్టాంగ ప్ర‌ణామం..

తిరుమల వెంకటేశ్వరుడిని శ్రీదేవి కూతురు, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ దర్శించుకుంది. ఈ రోజు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామి వారి సేవలో పాల్గొంది. సంప్రదాయబద్ధంగా లంగా ఓణీలో వచ్చిన జాన్వీకి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆ త‌ర్వాత ఆల‌య బ‌య‌ట‌కు వ‌చ్చిన జాన్వీ స్వామివారి ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద తిరుమ‌లేశునికి సాష్టాంగ ప్ర‌ణామం చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement