Monday, May 6, 2024

స‌కాలంలో ప‌న్ను చెల్లింపులు-రజ‌నీకాంత్ కి స‌ర్టిఫికెట్

స‌కాలంలో ప‌న్నులు చెల్లించ‌డంతో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి ఆదాయ‌ప‌న్ను శాఖ ఓ అవార్డ్ ను స‌ర్టిఫికెట్ రూపంలో ప్ర‌దానం చేసింది. పన్నులను సకాలంలో చెల్లిస్తున్నందుకు ఆయన్ని అభినందిస్తూ ఓ అవార్డ్ ను సర్టిఫికెట్ రూపంలో ఆదాయపన్ను శాఖ ప్రదానం చేసింది. దీన్ని రజనీకాంత్ తరఫున ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ స్వీకరించారు. ఆదాయపన్ను శాఖ దినోత్సవం సందర్భంగా చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ అవార్డ్ బహూకరణ జరిగింది. ఈ విషయాన్ని ఐశ్వర్య తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో వెల్లడించారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఈ సర్టిఫికెట్ ను అందించారు. సకాలంలో అధిక పన్నులు చెల్లించే వ్యక్తి కుమార్తెగా గర్విస్తున్నాను. ఆదాయపన్ను శాఖ తమిళనాడు, పుదుచ్చేరికి ఎన్నో ధవ్యవాదాలు అని ఐశ్వర్య పోస్ట్ పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement