Wednesday, May 1, 2024

చిత్తూరు జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో విషాదం నెలకొంది. పాలసముద్రం మండలం కన్యకాపురంలో ఇంటి నిర్మాణం కోసం కంకరలోడ్‌ను టిప్పర్ లిఫ్ట్ చేస్తుండగా హైటెన్షన్ వైరు టిప్పర్ బాడీకి తగిలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో టిప్పర్ డ్రైవర్ మనోజ్ కుమార్ (25), దొరబాబు (21), జ్యోతిష్ (19) ఉన్నారు. డ్రైవర్‌ను కాపాడేందుకు వెళ్లగా దొరబాబు, జ్యోతిష్ కూడా మరణించినట్లు తెలుస్తోంది. కాగా మృతులందరూ ఒకే గ్రామానికి చెందినవాళ్లుగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement