Friday, May 3, 2024

కాస్త ఊరట..స్వలంగా తగ్గిన కరోనా కేసులు

 ఏపీలో కరోనా మహమ్మరి ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1413 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,80,826 కి చేరింది. 54,455 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,413 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 18 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు. ఇక గడిచిన 24 గంటల్లో 1795 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,50,623 లక్షలకు చేరింది. ఇప్పటి దాకా 2, 52, 47, 884 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 19,549 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

ఇక కరోనాతో చిత్తూరులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు మరణించారు. ఇక, ఒకేరోజు 1,795 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

ఇది కూడా చదవండి: తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు: రేవంత్

Advertisement

తాజా వార్తలు

Advertisement