Thursday, April 18, 2024

కలెక్టరేట్ వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం

అనంతపురం కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకుని ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. స్పందన కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ ఎదుట మడకశిర మండలం కోడిగానిపల్లికి చెందిన రామాంజనేయులు కుటుంబం కలెక్టరేట్ బైఠాయించి ఆత్మహత్యాయత్నం చేసింది. రెవెన్యూ అధికారులు తమ భూమిని ఇతరులకు బదలాయించారంటూ బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సైతం అధికారులకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement