Monday, April 29, 2024

నిత్య‌పెళ్లి కూతురు – ఎవ‌రికీ విడాకులు ఇవ్వ‌కుండానే మూడు పెళ్లిళ్లు

ఈమె నిత్య పెళ్లి కూతురు..ఎవ‌రికీ విడాకులు ఇవ్వ‌కుండానే మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఈమె పేరే శిరీష..వ‌య‌సు 24సంవ‌త్స‌రాలు..నంద్యాల మండ‌లం మిట్నాల గ్రామంలో త‌ల్లి మేరీ జ‌సింటాతో క‌లిసి ఉంటోంది. కాగా శిరీష బేతంచర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డిని పెళ్లి చేసుకోవాలని భావించింది. మహేశ్వర్ రెడ్డికి ఇది రెండో వివాహం కావడంతో తనకు ఆర్థిక భద్రత కలిగించేలా రూ.5 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయాలని మహేశ్వర్ రెడ్డిని శిరీష కోరింది. ఆమె చెప్పినట్టుగానే మహేశ్వర్ రెడ్డి రూ.5 లక్షలు డిపాజిట్ చేశాడు. గత ఫిబ్రవరిలో వీరి పెళ్లి మద్దిలేటి స్వామి క్షేత్రంలో జరిగింది. అనంతరం మహేశ్వర్ రెడ్డి స్వగ్రామం ఆర్ఎస్ రంగాపురంలో కాపురం పెట్టారు. శిరీష తల్లి తన కుమార్తె అత్తారింట్లో కాపురం చేయాలంటే ఇంకా నగదు, ఆస్తి రాసివ్వాలని డిమాండ్ చేయడం ప్రారంభించింది. ఈ తరహా వేధింపులతో విసిగిపోయిన మహేశ్వర్ రెడ్డి… శిరీష గురించి లోతుగా ఎంక్వైరీ చేయించగా, ఆమెకు ఇదే తొలి పెళ్లి కాదన్న విషయం వెల్లడైంది. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుందని, వారిలో ఎవరికీ విడాకులు ఇవ్వకుండానే నెట్టుకొస్తోందని తెలిసి నివ్వెరపోయాడు. తాను కూడా ఆ నిత్యపెళ్లికూతురు వలలో పడ్డానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొత్తానికి పోలీసుల‌కి చిక్కింది ఈ నిత్య పెళ్ళికుమారై.

Advertisement

తాజా వార్తలు

Advertisement