Thursday, May 2, 2024

ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు షాక్.. ముగ్గురు క్రికెటర్లకు కరోనా

కరోనా మహమ్మారి క్రికెట్‌ ప్రపంచాన్ని వదిలిపెట్టడం లేదు. శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్ జట్టు త్వరలో పాకిస్థాన్‌తో వన్డే, టీ20 సిరీస్‌ల కోసం సన్నద్ధమవుతోంది. జూలై 8 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కి ముందు ఇంగ్లాండ్ జట్టులోని ముగ్గురు క్రికెటర్లకు కరోనా సోకింది.

ముగ్గురు క్రికెటర్లతో పాటు మొత్తం ఏడుగురు సిబ్బంది కరోనా సోకడంతో ఇంగ్లండ్ జట్టులో కలవరం మొదలైంది. దీంతో గురువారం నుంచి పాక్‌తో జరగాల్సిన వన్డే సిరీస్​ కోసం జట్టులో మార్పులు చేసింది. అంతేకాకుండా బెన్ స్టోక్స్ సారథ్యంలో కొత్త జట్టును ప్రకటించనుంది. మరోవైపు ఆగస్టు 4 నుంచి టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్​ జరగాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ప్రేక్షకులకు అనుమతి

Advertisement

తాజా వార్తలు

Advertisement