Saturday, April 20, 2024

కేసీఆర్, జగన్ మధ్య రహస్య ఒప్పందం జరిగింది: బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ జగన్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను సీఎం కేసీఆర్..ఏపీ సీఎం జగన్ కు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. దీనికోసమేనా పెద్ద ఎత్తున కొట్లాడి తెలంగాణ సాధించుకున్నది? అని ప్రశ్నించారు. నీటి ఒప్పందాలకు సంబంధించి ఇద్దరు సీఎంల అంగీకార పత్రాలు తమ వద్ద ఉన్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణకు 299 టీఎంసీల నీళ్లు, ఆంధ్రకు 512 టీఎంసీల నీళ్లు అని నాడు కేటాయింపులు చేసుకున్నది నిజం కాదా అని నిలదీశారు. తాను చెప్పింది తప్పయితే శ్రీశైలం డ్యామ్ లో దూకి చచ్చిపోయేందుకైనా సిద్ధమని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆ పత్రాల్లో ఉన్నట్టుగా తాను చెప్పిందే నిజమైతే సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పుకుంటూ, ముక్కు నేలకేసి రాసి పొర్లుదండాలు పెట్టాలని డిమాండ్ చేశారు. దీనికి రాష్ట్ర సీఎం సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు.

ఇది కూడా చదవండి: నిర‌స‌నకారుల‌పై చర్యలకు కేటీఆర్ ఆదేశం

Advertisement

తాజా వార్తలు

Advertisement