Monday, April 29, 2024

నిజామాబాద్ జిల్లాలో దొంగల బీభత్సం

నిజామాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దొంగలు భారీ దోపిడీకి పాల్పడ్డారు. రూ.2కోట్ల విలువైన బంగారం, రూ.50లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టర్లతో దొంగలు లాకర్ ను ధ్వంసం చేశారు. జిల్లాలోని మెండోరా మండలం బుస్సాపూర్ లో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలాన్ని సీపీ నాగరాజు పరిశీలించారు. క్లూస్ టీం స్పాట్ లో ఆధారాలు సేకరిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement