Sunday, April 28, 2024

ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌ను వ్య‌తిరేకిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ వ‌ద్ద నిర‌స‌న‌

ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌ను నిర‌సిస్తూ విశాఖ స్టీల్ ప్రాంట్ వ‌ద్ద ఉద్యోగులు, కార్మికులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణను నిరసిస్తూ గత 550 రోజులుగా పోరాటాలు చేస్తుంటే స్పందించకుండా ఏపీలో ప్రధాని పర్యటన కొనసాగించడంపై కార్మికులు నిరసన తెలిపారు. కూర్మన్నపాలెం జాతీయ రహదారిపై కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement