Tuesday, April 30, 2024

నాపై దాడికి దిగారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన వివేకా హత్యకేసు నిందితుడి భార్య..

కడప, ప్రభు న్యూస్ బ్యూరో : వివేకానంద రెడ్డి హత్య కేసులోని ఏ3 నిందితుడు అయిన ఉమా శంకర్ రెడ్డి భార్య స్వాతి తనపై దాడి జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వివేకానంద రెడ్డిని చంపి నీ భర్త డబ్బులు తెచ్చుకొన్నాడు అంటూ కొమ్మ పరమేశ్వర్ రెడ్డి అతని కుమారుడు నాపై చెప్పుతో దాడి చేసినట్లు తెలిపారు. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన విధంగానే నీ భర్తను, నిన్ను కూడా చంపేస్తాం అని బెదిరించార‌ని తెలిపారు. ఒంటరిగా ఇంట్లో సమయంలో చొరబడి దుర్భాషలాడుతూ కొమ్మ పరమేశ్వర్ రెడ్డి ఆయన కుమారుడు నాపై దాడి చేశారన్నారు. బలంగా నన్ను తోసి వేయడంతో కింద పడిపోయాను.
గాయాలు కావడంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాను. నాపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement