Friday, April 26, 2024

తగ్గేదేలే…40వేలకు పైమాటే!!

ఇండియా లో కరోనా కేసుల సంఖ్య అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,28,984 మందికి పరీక్షలు చేయగా 40,134 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు 422 మంది కరోనా తో మృతి చెందారు. తాజా గణాంకాల ప్రకారం మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.16 కోట్లకు చేరగా… మృతుల సంఖ్య 4.24 లక్షలకు చేరింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,13,718 యాక్టీవ్ కేసులు ఉండగా నిన్న ఒక్కరోజు 36,946 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో 17లక్షల మందికి టీకా అందించగా… మొత్తం 47.22కోట్ల డోసులను కేంద్రం పంపిణీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement