Sunday, May 5, 2024

Delhi: రెండో ద‌శ ఎన్నిక‌ల బ‌రిలో 1,210 మంది అభ్య‌ర్ధులు

13రాష్ట్రాల్లో 88 స్థానాల‌కు ఎన్నిక‌లు
మొత్తం 2,613 నామినేష‌న్ల దాఖ‌లు
కేర‌ళ‌లో అత్య‌ధికంగా నామినేష‌న్ల వెల్లువ
త‌ర్వాత స్థానం క‌ర్నాట‌క‌దే..
నాందేడ్ బ‌రిలో 92 మంది అభ్య‌ర్ధులు

న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల రెండో దశ ఎన్నికల్లో 1,210 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల రెండో దశలో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగే 88 స్థానాల్లో 1,210 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. 88 స్థానాల్లో 2,633 నామినేషన్లు దాఖలయ్యాయి. దాఖలైన 2,633 నామినేషన్ల పరిశీలన తరువాత 1,428 నామినేషన్లు చెల్లుబాటు అయ్యేవిగా గుర్తించినట్లు తెలిపింది. కేరళలో 20 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి అత్యధికంగా 500 నామినేషన్లు, కర్ణాటకలోని 14 స్థానాల నుంచి 491 నామినేషన్లు వచ్చాయి.

త్రిపురలో ఒక స్థానం నుంచి 14 నామినేషన్లు వచ్చాయి. మహారాష్ట్రలోని నాందేడ్‌ పార్లమెంటరీ నియోజకవర్గానికి గరిష్టంగా 92 నామినేషన్లు వచ్చాయి. కేరళలో 500 నామినేషన్లలో 204 నామినేషన్లను ఆమోదించగా, మిగిలిన వాటిని తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ తరువాత, 194మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కర్ణాటకలో 247, మహారాష్ట్రలో 204, కేరళలో 194, రాజస్థాన్‌ 152, ఉత్తరప్రదేశ్‌లో 91, మధ్యప్రదేశ్‌లో 88, అస్సాంలో 61, బీహార్‌లో 50, పశ్చిమ బెంగాల్‌లో 47, చత్తీస్‌గఢ్‌లో 41, జమ్ము కాశ్మీర్‌లో 22, త్రిపురలో 9మంది బరిలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మరో వంద కంపెనీల సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పారామిలిటరీ ఫోర్సెస్‌ (సిఎపిఎఫ్‌)ని మోహరించాలని హోం వ్యవహారాల మంత్రిత్వశాఖను ఆదేశించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement