Sunday, April 28, 2024

TS : ఆసుపత్రి బిల్డింగ్ ఎక్కి వ్య‌క్తి హ‌ల్‌చ‌ల్‌…

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆసుపత్రి బిల్డింగ్ ఎక్కి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్యాయత్నానికి పాల్పడ్డాడు. పట్టణానికి చెందిన రాజు అనే ట్రాక్టర్ డ్రైవర్ కుటుంబ కలహాలతో గోద్రెజ్ హెయిర్ డై ప్యాకెట్లు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

దీంతో రాజు స్నేహితులు అతడిని చికిత్స నమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వెళ్లగానే తనకు చికిత్స అవసరం లేదని చనిపోతానంటూ రాజు హడావిడి చేశాడు. తాను చికిత్స చేయించుకోనని, చనిపోతానంటూ ఆసుపత్రి బిల్డింగ్ పైకి ఎక్కి హల్‌చల్ సృష్టించాడు. సరిగ్గా అదే టైంలో అవుట్ పోస్ట్ పోలీసులు అక్కడికి రావడంతో రాజు బిల్డింగ్ పైనుంచి కిందికి దిగడంతో ఆంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement