Sunday, April 28, 2024

ఈనెల 30 నుంచి థియేటర్లు ఓపెన్.. పార్కింగ్ ఫీజుకు ప్రభుత్వం అనుమతి

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతపడ్డ థియేటర్లు ఈనెల 30 నుంచి తెరుచుకోనున్నాయి. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పలు సినిమాలు రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఈనెల 30న సత్యదేవ్ తిమ్మరుసు, తేజ సజ్జా ఇష్క్, నరసింహపురం వంటి సినిమాలు విడుదల కానున్నాయి.

మరోవైపు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే మల్టీప్లెక్సులు, షాపింగ్ మాల్స్‌లో ఫ్రీ పార్కింగ్ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పార్కింగ్ ఫీజుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సినీ ప్రియులు నిరాశకు లోనవుతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: అల్లు అర్జున్‌పై విజయం సాధించిన పవన్ కళ్యాణ్

Advertisement

తాజా వార్తలు

Advertisement