Saturday, April 27, 2024

కేసీఆర్‌ ముందు చూపుతోనే రెండో దశ కంటి వెలుగు.. హరీష్ రావు

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు చూపుతోనే కంటి వెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ప్రారంభించామని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. జనవరి 18 నుంచి జూన్‌ 30 వరకు జరిగే రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామని తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు. ప్రపంచంలోనే సామూహిక కంటి వెలుగు కార్యక్రమం దేశంలో మరెక్కడా లేదన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని వందరోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాకు అదనంగా 35 మంది వైద్యులను రిక్రూట్‌ చేశామని ఇప్పటికే 10లక్షల కళ్ల జోళ్లు ప్రతి జిల్లాకు చేరుకున్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement