Wednesday, May 8, 2024

గ్రూప్‌ -4 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం.. వరుస నోటిఫికేషన్లతో వేగం పెంచిన సర్కార్

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కొలువల జాతర కొనసాగుతోంది. ఎంతో మంది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రూప్‌-4 దరఖాస్తు ప్రక్రియ రేపు (శనివారం) ప్రారంభం కానుంది. ఈ పోస్టులకుగానూ ఈ నెల 30వ తేది నుంచి జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. గురువారంనాడు గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల కాగా, శుక్రవారం గ్రూప్‌-3 నోటిఫికేషన్‌ విడుదలైంది.

తాజాగా 1365 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23వ తేదీ మధ్యలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. 783 గ్రూప్‌ -2 పోస్టులకు గురువారం నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement