Sunday, April 28, 2024

లెక్క 44…ఆ స్కూల్ పై పగబట్టిన కరోనా !!

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతున్న వేళ… తెలంగాణలోని గురుకుల పాఠశాల పై పగబట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఉన్న కొన్ని స్కూళ్లలో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. పాలమాకుల లోని జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయం ఇందుకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. మూడు రోజుల కిందట 23 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ రాగా ఇప్పుడు తాజాగా మరో 21 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

మొత్తం బాధితుల సంఖ్య 44 చేరింది. ఇక పాఠశాలలో 900 మంది బాలికలు ఉండగా… అందులో 500 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 400 మందికి టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పిల్లలు కరోనా మహమ్మారి బారిన పడుతుండటం తో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలను తమ ఇంటికి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement