Wednesday, May 15, 2024

జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్…

జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లాలో భద్రతా దళాలు, ముష్కరుల మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టాయి. జిల్లాలోని మునిహాల్​ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న సమాచారం మేరకు… నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ఇక వీరి మధ్య జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు తీవ్రవాదులు హతమైనట్లు కశ్మీర్​ జోన్​ పోలీసు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement