Wednesday, May 8, 2024

అద్దెకు మెట్రో బోగీలు… ఇక బర్త్ డే పార్టీలు అక్కడే !!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇండియాలో ఆర్థిక మూలాలపై ఈ మహమ్మారి గట్టిగానే దెబ్బకొట్టింది. ఈ నేపథ్యంలోనే ఆదాయం పెంచుకునేందుకు రాజస్థాన్ లోని జైపూర్ మెట్రో సరికొత్త ఆలోచనతో ఆదాయం సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. కాగా చిన్నపాటి ప్రకటనల చిత్రీకరణకు ఇప్పటికే మెట్రో అద్దెకిస్తుంది. ఇప్పుడు తాజాగా బర్త్ డే వేడుకలకు, ఇతర కార్యక్రమాలకు గంటల చొప్పున అద్దెకు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

ఒక కోచ్ ను తీసుకోవాలనుకునే వారు గంటకు 5000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందట… సమయం మించితే ప్రతి గంటకు అదనంగా వెయ్యి చొప్పున వసూలు చేయనున్నట్లు సంస్థ తెలిపింది.ఇప్పటికే ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement