Friday, April 26, 2024

Guntur : భార్యను చంపి.. నివాళులర్పించిన భర్త..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఓ భర్త తన భార్యను చంపి.. దండేసి.. పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన జిల్లాలోని తెనాలి గాంధీనగర్ లో చోటుచేసుకుంది. తెనాలిలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న స్వాతిని తన భర్త కోటేశ్వర్ రావు అతి కిరాతకంగా హత్య చేశాడు. బ్యూటీ పార్లర్ కు కత్తి, పూలదండతో వెళ్లాడు. ప్రణాళిక ప్రకారం స్వాతిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా డెడ్ బాడీపై పూలదండలు వేసి భర్త నివాళులర్పించాడు. అనంతరం తెనాలి రూరల్ పీఎస్ లో భర్త కోటేశ్వరరావు లొంగిపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement