Wednesday, May 15, 2024

మూడేళ్ళ బాలుడి హత్య కేసులో.. నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించిన కోర్టు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రియుడితో కలిసి మూడేళ్ళ బాలుడిని హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ నాంపల్లి న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. 2022వ సంవత్సరం ఆగస్టు నెలలో ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌కు చెందిన ముత్యాల రవి ముషీరాబాద్‌కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

తమ సంబంధానికి మహిళ కొడుకు అడ్డువస్తున్నాడని భావించి అతడిని తల్లి ప్రియుడు కలిసి హతమార్చారు. నిందితుడికి నాంపల్లి కోర్టు మంగళవారం యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. హత్య జరిగిన సమయంలో చనిపోయిన బాలుడి తల్లి అక్కడ లేకపోవడంతో న్యాయమూర్తి ఆమెను మందలించి వదిలేశారు. నిందితుడిపై ముషీరాబాద్‌ పోలీసులు ఫాక్స్లో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement