Monday, April 29, 2024

TS | ఆయూష్‌ పీజీ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి 17 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: రాష్ట్రంలోని ఆయూష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏఐఏపీజీఈటీ-2023 పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు. పీజీ ఆయుర్వేదం, హోమియో, యునానీ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్‌లో రేపు (బుదవారం) ఉదయం 9 గంటల నుంచి 17వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హత ఇతర సమాచారానికి యూనివర్సిటీ- వెబ్‌సైట్‌ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు నేడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement