Thursday, May 2, 2024

లోయలో పడిపోయిన బస్సు.. రెస్క్యూ చేపట్టిన బోర్డర్​ పోలీస్​

ముస్సోరీస్-డెహ్రాడూన్ రోడ్డులో ఇవ్వాల (ఆదివారం) ఓ బస్సు లోయలో పడిపోయింది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) క్యాంపు సమీపంలో 39 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఈ ప్రమాదానికి గురైంది. ప్రమాదం అనంతరం ఐటీబీపీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇవ్వాల మధ్యాహ్నం 1.25 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాగా, ఐటీబీపీ అకాడమీ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement