Thursday, May 16, 2024

Delhi: దేశ రాజధానిలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు.. ఆంధ్రా ఎడ్యుకేషన్‌ సొసైటీలో ఘనంగా నిర్వహణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రా ఎడ్యుకేషన్‌ సొసైటి, డాక్ట‌ర్‌ దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ స్మారక ఉన్నత పాఠశాలలో సోమవారం ఈ వేడుకలు నిర్వ‌హించారు. ఆంధ్ర విద్యా సంఘం యాజమాన్య సభ్యుల చేతుల మీదుగా జ్యోతిప్రజ్వ‌లనతో ఆరంభమైంది. ఆంధ్రా ఎడ్యుకేషన్‌ సొసైటి అధ్యక్షులు డాక్ట‌ర్‌ ఎమ్‌.ఆర్‌.మూర్తి, కార్యదర్శి ఎస్‌. ఈశ్వర్‌ ప్రసాద్‌, కోశాధికారి వి. ఛటర్జీ, పాఠశాల ఉప ప్రధానోపాధ్యాయులు ఎస్‌. ఉపేందర్‌, ఇతర యాజమాన్య సభ్యులు హాజరయ్యారు.

ముఖ్య అతిథి ఢిల్లీ విశ్వవిద్యాలయ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. జి వెంకట రామయ్య తెలుగు భాష గొప్పతనం గురించి విద్యార్థులకు ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం ముఖ్య అతిథికి యాజమాన్య బృందం చేతుల మీదుగా సన్మానం జరిగింది. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement