Tuesday, May 14, 2024

ఎన్నికలు రద్దు పిటీషన్.. తోసిపుచ్చిన హైకోర్టు

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు రద్దు చేయాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్‌లో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలైంది. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని షబ్బీర్ అలీ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేసిందని, ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ కోరారు.

అయితే, లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించేందుకు  చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నిరాకరించారు. ఎన్నికల కమిషన్‌ కు మరోసారి విన్నవించాలని పిటీషనర్‌ కు చీఫ్ జస్టిస్ సూచించారు. ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలను ఆపలేమని చెప్పడంతో డివిజన్ బెంచ్‌లో పిటీషన్ దాఖలు చేశారు. అయితే లంచ్ మోషన్ అనుమతి ఇవ్వకపోవడంతో రెగ్యులర్ పిటీషన్‌ను షబ్బీర్ అలీ వేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement