Tuesday, May 7, 2024

Telangana Election – మా అభ్యర్ధులతో కెసిఆర్ మంతనాలు… డికె ఆరోపణ..

హైద‌రాబాద్ – తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే కొందరు కాంగ్రెస్ లీడర్లతో టచ్ లో ఉంటున్నట్లు తమకు సమాచారం వచ్చిందని డీకే శివకుమార్ తెలిపారు. హంగ్ ఏర్పడే అవకాశాలున్ననేపథ్యంలో కొందరు కాంగ్రెస్ అభ్యర్ధులతో కెసిఆర్ స్వయంగా మంతనాలు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు.. బెంగుళూరులో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆశిస్తున్నట్లు డీకే శివకుమార్ వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి రిసార్ట్ రాజకీయాలు చేసే అవసరం తమకు లేదన్నారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ . కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవరూ కొనుగోలు చేయలేరని.. తమ నేతలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. ఈ విషయంలో తమ పార్టీ జాతీయ, రాష్ట్ర నేతలంతా ఎంతో నమ్మకంతో ఉన్నామన్నారు.

కాగా, నేటి నుంచి డికె హైద‌రాబాద్ లో మ‌కాం వేయ‌నున్నారు… రాష్ట్ర ఎన్నికల ఫలితాల మానటరింగ్ బాధ్యతను శివకుమార్ కు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. హంగ్ ఏర్పడితే అభ్యర్థులు ప‌క్క చూపులు చూడ‌కుండా చూసే బాధ్య‌త‌ను డీకే శివకుమార్ కు అప్ప‌గించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement