Sunday, May 19, 2024

Suicide: ఇంటర్‌ విద్యార్థి ఆత్మ‌హ‌త్య

అనంతపురంలోని ఓ కాలేజ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థి రాత్రి కాలేజ్‌ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

విద్యార్థి కాలేజ్‌ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని కళాశాల యాజమాన్యం తెలిపింది. మృతురాలి స్వస్థలం బొమ్మనహాళ్లు మండలం కలగల్ల గ్రామంగా అధికారులు గుర్తించారు. విద్యార్థిని మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. సుధ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement