Saturday, April 27, 2024

తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా..

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 869 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మరో 08 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 1197 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,24,379 కు చేరగా.. రికవరీ కేసులు 6,07,658 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,669 గా ఉంది.. కోవిడ్ బాధితుల రికవరీ రేటు 97.32 శాతంగా ఉందని.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13,052 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. గత 24 గంటల్లో 1,05, 123 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

ఇది కూడా చదవండి: కరోనాను ఎదుర్కోవడంలో తెలంగాణ ఫెయిల్: సర్వే

Advertisement

తాజా వార్తలు

Advertisement