Friday, May 10, 2024

Delhi | ఢిల్లీలో తెలంగాణ బోనాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధానిలో తెలంగాణ బోనాల సంబరాలు ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి ఇండియా గేట్ వరకు తెలంగాణ బోనాలతో మహిళలతో ఊరేగింపు జరిగింది. రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న బోనాలు మంగళవారం పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ళ మధ్య  ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బోనాల ఉత్సవాలు నిర్వహించేందుకు సింహవాహిని శ్రీమహంకాళి ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement