Tuesday, April 30, 2024

Sports | బాస్కెట్‌బాల్‌ లీగ్‌ ట్రైఅవుట్‌కి 350 మంది అథ్లెట్లు

మొట్టమొదటిసారిగా ప్రారంభం అవుతున్న మహిళల బాస్కెట్‌బాల్‌ లీగ్‌ ‘ఎలైట్‌ ఉమెన్స్‌ ప్రో బాస్కెట్‌బాల్‌ లీగ్‌’కు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ముంబైలో జరిగిన మూడు రోజుల ట్రైఅవుట్‌కి 350 మందికిపైగా అథ్లెట్లు హాజరయ్యారు. సెలెక్టర్లలో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు చెందిన రిటైర్డ్‌ బాస్కెట్‌బాల్‌ కోచ్‌లు హెచ్‌ పరమేశ్వర్‌, జగత్‌ నారాయణ్‌ నెహ్రా ఉన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఆటగాళ్లు, కోచ్‌లతో లీగ్‌ జరగనుంది. ఎలైట్‌ ప్రో బాస్కెట్‌బాల్‌ లీగ్‌ ట్రైఅవుట్‌ల సీఈవో సన్నీ భండార్కర్‌ మాట్లాడుతూ, ”ముంబైలో మేము చూసిన ప్రతిభ చాలా బాగుంది, చాలా మంది యువ ఆటగాళ్లు ట్రై-అవుట్‌లకు వచ్చారు. భారతదేశంలో బాస్కెట్‌బాల్‌ ఆటను అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement