Saturday, May 4, 2024

మొదటి పంచ్ ఇంగ్లండ్‌దే..

అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేసింది. శ్రేయాస్ అయ్యర్ (67) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ తక్కువ స్కోర్లకే వెనుతిరిగారు. భారత్ విసిరిన 125 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ జాసన్ రాయ్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (28), డేవిడ్ మలాన్ (24), బెయిర్ స్టో (26) పరుగులు చేశారు. భారత బౌలర్లలో చాహల్, సుందర్ చెరో వికెట్ తీశారు. దీంతో ఇంగ్లీష్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ-20 ఇదే మైదానంలో ఆదివారం జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement