Sunday, April 28, 2024

కోట్ల విజయభాస్కర్ రెడ్డికి టీడీపీ నేతల నివాళులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి 102వ జయంతి సందర్భంగా మంగళవారం కర్నూలు జిల్లాలో కోట్ల సర్కిల్ లోని ఆయన విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కిసాన్ ఘాట్ ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, కర్నూల్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పి.జి.రాంపుల్లయ్య యాదవ్, కోడుమూరు ఇంఛార్జి ఆకేపోగు ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ ఆకేపొగు వెంకటస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పి.జి.నరసింహులు యాదవ్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జి.గోపినాథ్ యాదవ్, కేడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పి.లోక్నాథ్ యాదవ్, కోట్ల అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement