Wednesday, May 15, 2024

వైసీపీ-బీజేపీ చీకటి ఒప్పందానికి విజయసాయిరెడ్డి నియామకమే నిదర్శనం: టీడీపీ

ఇటీవల పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని నియమించింది. దీంతో బీజేపీతో వైసీపీకి చీకటి స్నేహం కొనసాగుతోందని టీడీపీ నేత, మాజీ మంత్రి ఫరూక్ ఆరోపించారు. దీనికి నిదర్శనం విజయసాయిరెడ్డి నియామకమే నిదర్శనమని చెప్పారు. అనేక ఆర్థిక నేరాల్లో విజయసాయి ఏ2గా ఉన్నారని… ఆయన బెయిల్ రద్దుపై ఈనెల 13న సీబీఐ కోర్టులో విచారణ కూడా జరగబోతోందని అన్నారు.

న్యాయమూర్తులను కించపరుస్తూ మాట్లాడిన వైసీపీ కార్యకర్తలను వెనకేసుకొచ్చిన చరిత్ర విజయసాయిరెడ్డిదని చెప్పారు. అలాంటి వ్యక్తిని పీఏసీలో సభ్యుడిగా నియమించడమంటే ప్రజలకు ఏం సంకేతాలను ఇస్తున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని ఫరూక్ ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సంబంధం పెట్టుకుంటే అదేదో పెద్ద అపరాధం అయినట్టు వైసీపీ గగ్గోలు పెట్టిందని… ఇప్పుడు అదే కేంద్రంతో వైసీపీ ఎలా అంటకాగుతుందని ప్రశ్నించారు. ఓ వైపు బీజేపీతో స్నేహం చేస్తూ, మరోవైపు ముస్లింలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటూ వైసీపీ మోసం చేస్తోందని మండిపడ్డారు.

ఈ వార్త కూడా చదవండి: ఏపీలో ఈనెల 14తో ముగియనున్న నైట్ కర్ఫ్యూ

Advertisement

తాజా వార్తలు

Advertisement