Sunday, April 28, 2024

సెకండ్ టెస్ట్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం పడటంతో ఈ మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. పిచ్ పరిస్థితుల దృష్ట్యా ఇంగ్లీష్ జట్టు టాస్ గెలిచిన వెంటనే బౌలింగ్ వైపు మొగ్గు చూపింది. ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ జట్టులో స్టువర్ట్ బ్రాడ్ స్థానంలో మార్క్ వుడ్, లారెన్స్ స్థానంలో మొయిన్ అలీ, క్రాలీ స్థానంలో హసీబ్ హమీద్‌ను జట్టులోకి తీసుకుంది. మరోవైపు టీమిండియా జట్టులో శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఇషాంత్ శర్మ తుదిజట్టులోకి వచ్చాడు. ఇరు జట్ల మధ్య నాటింగ్ హోంలో జరిగిన తొలి టెస్ట్ వర్షం కారణంగా డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

భారత్: రోహిత్, కేఎల్ రాహుల్, పుజారా, కోహ్లీ, రహానె, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, సిరాజ్
ఇంగ్లండ్: జో బర్న్స్, సిబ్లే, హసీబ్ హమీద్, జో రూట్, బెయిర్ స్టో, బట్లర్, మొయిన్ అలీ, శామ్ కరణ్, రాబిన్ సన్, మార్క్ వుడ్, అండర్సన్

ఈ వార్త కూడా చదవండి: వరల్డ్ నెంబర్ 2 నీరజ్ చోప్రా

Advertisement

తాజా వార్తలు

Advertisement