Sunday, May 5, 2024

చంద్ర‌బాబు ఇలాకాపై..వైసీపీ క‌న్ను..

టిడిపి అభ్య‌ర్థుల‌ను బెదిరిస్తున్నారంటున్నారు ఆ పార్టీ నేత‌లు. ప‌ల్నాడులో పొలిటిక‌ల్ వార్ జ‌రుగుతోంది. అక్క‌డ ప‌ట్టు నిలుపుకునేందుకు కాసు,య‌ర‌ప‌తినేని ప‌ట్టు బ‌ట్టారు. దాంతో దాచేప‌ల్లి..గుర‌జాల‌లో ఎన్నిక‌ల హీట్ నెల‌కొంది. రెండు చోట్లా పోటీకి బిజెపి..జ‌న‌సేన వ్యూహాలు ప‌న్నుతోంది. కాగా నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ‌పై టిడిపి అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తోంది. అయితే కుప్పం మున్సిపాల్టీని సొంతం చేసుకోవాల‌ని వైసీపీ స్కెచ్ వేస్తోంది. ఈ మేర‌కు మంత్రి పెద్దిరెడ్డి కుప్పంలో మ‌కాం వేయ‌నున్నారు. దాంతో కుప్పంలో తారాస్థాయికి చేరుకున్నాయి రాజ‌కీయాలు.వైసీపీ తీరుపై విమ‌ర్శ‌లు కూడా వెల్లువెత్తుతున్నాయి. చంద్ర‌బాబుకి మ‌తి చెడిపోయింద‌ని వైసీపీ మ‌హిళా నేత రోజా ఎద్దేవా చేశారు. మ‌రి చంద్ర‌బాబు నాయుడు వారి వ్యూహాల‌ను ఎలా తిప్పికొడ‌తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement