Sunday, May 5, 2024

ఈవీ కార్ల‌ ధ‌ర‌లు పెంచిన టాటా మెటార్స్

ఇండియాలో చీపెస్ట్ ఎలక్ట్రిక్​ వెహికిల్​గా గుర్తింపు పొంది బుకింగ్స్ ప‌రంగా రికార్డ్ సృష్టించింది టాటా టియాగో ఈవీ. ఒక్క రోజులోనే 10వేలకు పైగా యూనిట్​లు బుక్​ అయ్యాయి. ఇక నెల రోజుల వ్యవధిలో బుకింగ్స్​ సంఖ్య 20వేలు దాటిపోయింది. ఈ ఈవీ డెలవరీలు ఇటీవలే మొదలయ్యాయి. కాగా, ఇప్పుడు టియాగో ఈవీ ధరలను పెంచుతున్నట్టు టాటా మోటార్స్ సంస్థ‌ ​ ప్రకటించింది. టాటా టియాగో ఈవీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 8.69లక్షలుగా ఉండేది. అది ఇప్పుడు రూ. 11.99లక్షల వరకు వెళ్లింది. ఇక ఇప్పుడు వేరియంట్​పై రూ. 20వేల వరకు పెంచింది టాటా మోటార్స్​.

  • టాటా టియాగో ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్​లు ఉంటాయి. 1) అవి 19.2కేడబ్ల్యూహెచ్​, 2) 24కేడబ్ల్యూహెచ్​. మొదటికి 250కి.మీల రేంజ్​ ఇస్తుంటే.. రెండోదానికి 315కి.మీల దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది.
  • ఇక‌ తాజా పెంపుతో.. 19.2కే డబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​, 3.3 కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్​ ఆప్షన్​ ఉండే ఎక్స్​ఈ వేరియంట్​ ధర 8.69లక్షలకు చేరింది. ఎక్స్​టీ వేరియంట్​ ధర రూ.9.29లక్షలకు పెరిగింది.
  • 24కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​, 3.3కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్​ ఆప్షన్​ ఉన్న ఎక్స్​టీ వేరియంట్​ ధర రూ.10.19లక్షలుగాను, ఎక్స్​జెడ్​+ వేరియంట్​ ధర రూ.10.99లక్షలుగాను, ఎక్స్​జెడ్​+ టెక్​ ఎల్​యూఎక్స్​ ధర రూ.11.49లక్షలుగాను ఉంది.
  • మరోవైపు 24కే డబ్ల్యూహెచ్​, 7.2కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్​ ఆప్షన్​, ఎక్స్​జెడ్+ వేరియంట్​ ధర రూ. 11.49లక్షలు, ఎక్స్​జెడ్​+ టెక్​ ఎల్​యూఎక్స్​ ధర రూ. 11.99లక్షలుగాను ఉంది.
Advertisement

తాజా వార్తలు

Advertisement