Monday, April 29, 2024

విద్యుత్ ఎసిడి చార్జీలపై ప్రభుత్వం పునరాలోచించాలి .. అక్బరుద్దీన్

విద్యుత్ ఎసిడి చార్జీల వసూలుపై ప్రభుత్వం పునరాలోచించాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు. అసెంబ్లీ స‌మావేశాల్లో ఆయ‌న మాట్లాడుతూ… పాతబస్తీపై కొందరు రాజకీయ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పాతబస్తీలో కరెంటు చోరీ జరుగుతుందని విమర్శిస్తున్నారని.. ఒకవేళ పాతబస్తీలో విద్యుత్ చోరీ జరిగితే మేమే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎంఐఎం ప్రజా ప్రతినిధులు ఉన్నారని, అక్కడ బీఆర్ఎస్ ప్రతినిధులకు ఇచ్చినట్లే ఎంఐఎం ప్రతినిధులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement